యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ముందు నుండి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల ఇండస్ట్రీస్ లో కూడా తనకంటూ మాస్ జనాల్లో ఎవరికి సాధ్యంకాని స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ బాగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. గత ఏడాది ప్రభాస్ అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ 'సాహో' తో పలకరించాడు. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరింది. తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో మాత్రం సాహో సూపర్ హిట్ గా నిలిచింది. 'బాహుబ‌లి', 'బాహుబలి 2', ‘సాహో’ చిత్రాలతో అమాంతం నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడని చెప్పవచ్చు. అందుకే ప్రభాస్ నుండి పక్కా మాస్ పాన్ ఇండియా సినిమా రావాలని కోరుకుంటున్నారు సినీ అభిమానులు. 

 

కాగా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న పక్కా మాస్ సినిమా ప్రభాస్ చేస్తాడా.. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా ఫార్ములాతో క్లాస్ ఫీల్ ఉన్న యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ సినిమా ‘సాహో’ అత్యున్నత సాంకేతికతో భారీగానే ఉన్నా పక్కా లోకల్ అనే ఫీలింగ్ కలగలేదు మాస్ ప్రేక్షకులకు. ఇక ప్రస్తుతం చేస్తున్నది కూడా అలాంటి క్లాస్ సినిమానే. అందుకే ప్రభాస్ పూర్తి మాస్ ఆడియన్స్ కోసం ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తే బాగుంటుంది. మరి ప్రభాస్ అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆశిద్దాం. 

 

ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి ' ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో చేయనున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే లేటెస్టుగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు సినీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: