బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా, ద తాష్కంట్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిపై ఫైర్‌ అయ్యింది. కరోనా వైరస్‌ ప్రబలుతున్న సమయంలో తప్పుడు వార్తలు స్పెడ్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీస్‌ లను కోరింది. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పేజ్‌లో `ఈ ఆపత్‌ కాలంలో ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ స్పెడ్‌ చేసే వారిపై చర్చలు తీసుకోవాడానికి ప్రోసిజర్‌ ఎంటీ` అంటూ ముంబై పోలీస్‌ లను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేసింది సొనాక్షి.

 

దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి.. సోనాక్షిసినిమా షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసి `ఈ సమయంలో ఎవరు షూటింగ్ చేస్తున్నారు?` అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పదించిన సోనాక్షి, ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరింది. `నేను ఓ బాధ్యత గల యువతిగా ఇంట్లోనే ఉంటూ, సోషల్ డిస్టాన్సింగ్ మెయిన్‌టైన్ చేస్తున్నాను. ఎలాంటి షూటింగ్‌లు చేయటం లేదు` అంటూ కామెంట్ చేసింది.

 

అయితే సోనాక్షికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు వివేక్. తాను సోనాక్షిని ఉద్దేశించి ట్వీట్ చేయలేదు. ఓ వార్త పత్రికలో అలాంటి వార్త రావడాన్ని మాత్రమే తాను తప్పు పట్టినట్టుగా సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే వివేక్ సమాధానంతో సోనాక్షి సంతృప్తి చెందలేదు. ఎవరికీ ట్యాగ్ చేయకుండా, విషయాన్ని పూర్తిగా వివరించకుండా ఇతరుల ఫోటోను పోస్ట్ చేయటం తప్పే అంటూ ఆమె ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఈ విషయంపై నెటిజెన్లు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. సోనాక్షికి నెటిజెన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: