దేశంలో కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని మరింత కట్టుదిట్టంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మే3వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో వ్యవస్థలన్నీ మరికొన్ని రోజులు నిస్తేజం కానున్నాయి. ఇందులో సినిమా పరిశ్రమ కూడా ఉంది. తెలంగాణలో ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ప్రకటనతో మరికొన్ని వారాల పాటు కూడా సినిమా షూటింగులు జరిగే అవకాశం లేదు.

 

 

ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్స్ లో ఉన్న హీరోల సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ-బోయపాటి మూవీ, నాగార్జున వైల్డ్ డాగ్, వెంకటేశ్ నారప్ప, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, క్రిష్ మూవీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా ఆర్ఆర్ఆర్, ప్రభాస్ మూవీ, అల్లు అర్జున్ పుష్ప.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ మరికొంత కాలంపాటు వాయిదా పడనున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సంబంధించి ఏ సినిమా కూడా షూటింగ్ లో లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితిలో కాస్త ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉన్నది మహేశ్ బాబు మాత్రమే అని చెప్పాలి.

 

 

మిగిలిన అందరి హీరోలతో పాటు వారి నిర్మాణ సంస్థలకు మరికొంత కాలం టెన్షన్ తప్పేట్టు లేదు. ఇక షూటింగ్ పూర్తై రిలీజ్ కు సిద్దమైన కొన్ని సినిమాలకు కూడా కోరోనా ఎఫెక్ట్ తప్పలేదు. రవితేజ క్రాక్, నాని వి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి సినిమాలకు వెయిటింగ్ తప్పట్లేదు. షూటింగ్ చివరి దశలో ఉన్న నాగచైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడనుంది. లాక్ డౌన్ పూర్తయ్యాక కూడా సినిమాల రిలీజ్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: