బాలీవుడ్ లోకి వెళ్లాలంటే.. అదృష్టం ఉండాలంటారు. ముందు సౌత్ లో తామేమిటో నిరూపించుకోవాలి. పెర్ ఫార్మెన్స్ లోనే కాదు.. గ్రామర్ లోనూ ఆకట్టుకొని.. కొన్ని సంవత్సరాలు వెయి చేస్తే గానీ.. హిందీ ఇండస్ట్రీ పిలవదు. అయితే.. ఓ హీరోయిన్ విషయంలో ఈ రూల్ వర్తించదు. హీందీ  మూవీతో పాటు. వెబ్ సిరీస్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. 

 

అర్జున్ రెడ్డితో పరిచయమైన షాలినీ పాండే.. హిందీలో బిజీ అయిపోతోంది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో జత కడుతోంది. జయేశ్ భాయ్ జోర్దార్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. 

 

తక్కువ టైమ్ లో హిందీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ షాలిని.. అర్జున్ రెడ్డితో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సూపర్ మూవీని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా హిట్టే. అర్జున్ రెడ్డిని చూసిన బాలీవుడ్ కు షాలిని బాగా నచ్చేసినట్టుంది. రెండేళ్లు తిరగకుండా.. ఈ అమ్మడిని తీసుకెళ్లిపోయారు. అయితే ఈ అమ్మడికిది రెండో హిందీ సినిమా. అర్జున్ రెడ్డి తర్వాత మేరీ నిమ్మె అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది షాలిని. 

 

షాలినీ పాండే రణ్ వీర్ సింగ్ మూవీతో పాటు.. హిందీలో వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. మరో చిన్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని తెలుగులో 118.. ఇద్దరి లోకం ఒక్కటే సినిమాల్లో హీరోయిన్ గా నటించినా గుర్తింపు దక్కలేదు. అనుష్క నిశ్శబ్ధం మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగులో ఆఫర్స్ రాకున్నా.. ఈ భామ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. మొత్తానికి షాలినీ పాండే తెలుగులో ఆఫర్స్ తగ్గినా హిందీ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: