ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగి  ఎంతో మంది ప్రేక్షకులను మతిపోగొట్టినముద్దుగుమ్మ శ్రేయ. తన నడుము ఒంపులతో ఎంతోమంది కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. అదిరిపోయే నటనతో ఆకట్టుకుని తన అందంతో  దర్శక నిర్మాతలను ఆకర్షించింది . సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరు హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన శ్రీయ ... ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను కూడా అందుకుంది. ఇక తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది మతిపోగొట్టిన విషయం తెలుస్తుంది. అభిమానులందరినీ పగటి కలలు కనేలా  తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోయింది శ్రియ. 

 

 

 2018లో బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రు కొచ్చిన్ ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు ఏమి దూరం కాలేదు అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది ఈ అమ్మడు. మరోవైపు పెళ్లి తర్వాత కూడా తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులో  హీట్ పుట్టిస్తోంది. అయితే శ్రియ గత కొద్ది రోజులుగా భర్తతో కలిసి స్పెయిన్లోని బార్సిలోనాలో ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ స్పెయిన్ లో  విలయ తాండవం చేస్తూ ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రియ తన భర్తతో కలిసి అనేక వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్మెంట్ చేసేందుకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా శ్రీయ  భర్త ఆండ్రి కి  కరోనా  వైరస్ లక్షణాలతో బాధ పడుతున్నట్లు తాజాగా ఓ ఆంగ్ల దిన పత్రికకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది శ్రీయ. భర్త ఆండ్రి కి  పొడిదగ్గు సహా జ్వరం జలుబు ఉన్నాయని... భయానకమైన కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఉండడంతో వెంటనే తన భర్తను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది తన భర్తకు వైద్య చికిత్సలు చేసి కొద్ది రోజుల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండాలి అంటూ సలహా ఇచ్చారని.. దేవుడి దయ వల్ల తన భర్త ఇప్పుడు బాగానే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది శ్రీయ.

మరింత సమాచారం తెలుసుకోండి: