నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గతేడాది తన తండ్రి జీవితంపై తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన అచ్చ తెలుగు భామను హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచి మూవీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే  ఈ మూవీలో డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్న బాలయ్య ఓ పాత్రలో భాగంగా విలన్‌ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌.

 

 గత కొంత కాలంగా బాలయ్య ఓ విభిన్నమైన పాత్రలో నటించాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌ పాత్రను బలంగా రూపొందిస్తున్నారట బోయపాటి. అయితే బాలయ్య వంటి హీరోను ఢీ కొట్టడానికి అవతల కూడా బాలయ్యనే ఉండాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా శ్రియ - అంజలి నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ బాలకృష్ణ జోడీగా ఒక కొత్త హీరోయిన్ కనిపించనుందంటూ తాజాగా బోయపాటి చెప్పారు. బాలకృష్ణ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లను అనుకుంటున్నామనీ, అందులో ఒకరి పేరును సరైన సమయం చూసి ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

 

 

గత కొంత కాలంగా ఈ మూవీలో హీరోయిన్ల విషయంలో తెగ ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఈ మూవీలో శ్రియ, అంజలి ఉన్నారా? లేరా అన్న విషయం పక్కన బెడితే కొత్త హీరోయిన్ ని తీసుకోవడం పై  బోయపాటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందుతుందన్న కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం షూటింగ్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే
 

మరింత సమాచారం తెలుసుకోండి: