టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండస్ట్రీలో హీరోగా తెరంగేట్రం చేసి రెండు దశాబ్బాలు దాటింది. బాలనటుడిగా చూస్తే మూడు దశాబ్దాలు దాటిపోయింది. తొలి సినిమా రాజకుమారుడు తర్వాత చేసిన రెండో సినిమా యువరాజు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ బ్యానర్ పై బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయి నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రారంభోత్వవానికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, మహేశ్ కలిసి దిగిన ఫొటోను ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసే ఇలాంటి సందర్భం మరోటి రావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పిక్ లో పవన్ కల్యాణ్ బద్రీ సినిమా మేకోవర్ లో ఉన్నారు. అంతకు ముందు ఏడాది పవన్ కల్యాణ్ తో బూరుగుపల్లి శివరామకృష్ణ తమ్ముడు సినిమా నిర్మించారు. ఆ పరిచయంతో యువరాజు సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. యువరాజు ప్రారంభోత్సవానికి నాగార్జున, రాఘవేంద్రరావు, వెంకటేశ్, రామానాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భం తర్వాత పవన్, మహేశ్ మరో సందర్భంలో కలిశారు. మహేశ్ నటించిన అర్జున్ సినిమా పైరసీ జరిగిన సందర్భంలో మహేశ్ కు పవన్ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాడు. ఆ సందర్భంలో ఇద్దరూ కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఇందుకు కృతజ్ఞతగానే పవన్ నటించిన జల్సా సినిమాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మళ్లీ వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. యువరాజు సినిమా 2000 సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైంది. 17 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.
20 Years for Superstar @urstrulyMahesh's Superhit romantic Entertainer #Yuvaraju Directed by YVS Chowdary Produced by Burugupalli Sivaramakrishna (14/04/2000) #20YearsForYUVARAJU pic.twitter.com/VAS9s0Q7Fk
— BARaju (@baraju_SuperHit) April 14, 2020