టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు శ్రీను వైట్ల.  ఆయన సినిమాలంటే అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది.  టాప్ హీరోలతో ఆయన సినిమాలు తీశారు.  మొదటి సినిమా నీ కోసం...  కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం మూవీ ద్వారా మంచి పేరు సంపాదించాడు.  ఆ తర్వాత శ్రీను వైట్లకు బాగా కలిసి వచ్చింది.. వరుసగా హిట్స్ అందుకున్నాడు. సొంతం, వెంకి, అందరివాడేలే, ఢీ, దుబాయ్ శీను, రెడీ ఇలా వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు.  మహేష్ బాబు తో దూకుడు, ఎన్టీఆర్ తో బాద్ షా లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

 

 

అయితే శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య స్నేహం ఎంతో గొప్పగా సాగింది. వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్స్ పడ్డాయి. అయితే కొంత కాలం క్రితం వీరి మద్య తేడాలు రావడం.. విడిపోవడం జరిగింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన సినిమా జాబితాలో 'ఢీ' ఒకటిగా కనిపిస్తుంది. కథ, మాటలు కోన వెంకట్ అందించిన ఈ సినిమాలో, మంచు విష్ణు - జెనీలియా జంటగా నటించారు. శ్రీహరి ముఖ్య పాత్రలో నటించారు.  నిన్నటితో ఈ సినిమా 13 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

 

 

ప్రస్తుతం శ్రీను వైట్ల .. కోన వెంకట్ మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం లేదని కొంత కాలాంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందువలన శ్రీను వైట్ల సినిమాలకి కోన వెంకట్ పని చేయడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల కోన వెంకట్ మాట్లాడుతూ... శ్రీను వైట్లతో కలిసి పనిచేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అంతేకాదు కొన్ని కథలను శ్రీను వైట్ల మాత్రమే హ్యాండిల్ చేయగలడంటూ అభినందించాడు. ఈ నేపథ్యంలో  శ్రీను వైట్ల కూడా ఈగోలు పక్కన పెట్టేసి, కోన వెంకట్ -  గోపీమోహన్ లతో 'ఢీ 2' చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడని అంటున్నారు. మరి ఇదే గనక నిజమైతే.. మరో సూపర్ హిట్ ఖాయం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: