టాలీవుడ్ లో బాహుబలిగా పేరు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. ఈమూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆ మద్య షూటింగ్ నిమిత్తం జార్జియాకు వెళ్లి వచ్చిన తర్వతా ప్రస్తుతం ఎవరి ఇంట్లో వారు సేద తీరుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వ్యాప్తి జరుగుతుంది.. కరోనాతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. దాంతో ఇతర దేశాల్లో షూటింగ్ బంద్ చేశారు. దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో అన్ని మూవీస్ షూటింగ్ లు షట్ డౌన్ చేశారు. ఇక టాలీవుడ్ లోకి అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ స్టార్ హీరో అవలేక ఇబ్బందులు పడుతున్నాడు గోపి చంద్.
ప్రముఖ విప్లవ దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన గోపిచంద్ మొదట విలన్ గా నటించి తర్వాత హీరో అయ్యారు. ఒకప్పుడు విలన్ గా నటించినపుడు వర్షం మూవీలో గోపిచంద్, ప్రభాస్ లు ఢీ అంటే ఢీ అన్నట్లుగా నటించారు. గోపిచంద్ ఒకటో రెండో సినిమాలు మినహా ఆయన రాణించిన సినిమాలు లేవు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు తన సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తుంది. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ప్రభాస్ కి ఒక పాత్ర ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఒక పది నిమిషాలు ప్రభాస్ ఉండే విధంగా చూడమని దర్శకుడ్ని కోరినట్టు సమాచారం. గతంలో వీరిద్దరి స్నేహం నేపథ్యంలో ప్రభాస్ కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఇదే గనక నిజం అయితే ఆ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవొచ్చు. గోపిచంద్ కెరీర్ లో వచ్చిన హిట్ లు పెద్దగా చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేవు. అయితే ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేసే వరకు అసలు విషయం తెలియదు.. సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది.