ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. ప్రభాస్ నటిస్తున్న 20 వ చిత్రం నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మే రెండు లేదా మూడో వారం లో విడుదల కానుందని సమాచారం. నిజానికి కరోనా లేకుంటే ఈపాటికే ఫస్ట్ లుక్ విడుదలయ్యేదే కానీ చిత్ర యూనిట్ ఎవరింటికి వారు పరిమితం కావడంతో  ఫస్ట్ లుక్ ను వాయిదా వేశారు దాంతో ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ లుక్ విడుదల తరువాత వరుసగా మరిన్ని అప్డేట్ లు ఇవ్వడానికి యూవీ క్రియేషన్స్  ప్లాన్ చేస్తుందట. 
 
ఇక ఈ చిత్రం ఇటీవల జార్జియా లో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబద్ లో జరుగనుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తోపాటు తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించనున్నాడని తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో తెరకెక్కనున్నఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించనుంది.
 
సినిమా తోపాటు ప్రభాస్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయనున్నాడని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: