గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి  బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఈసినిమా తరువాత రామ్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం తెలుగు రీమేక్ కు ఓకే చెప్పాడు. అదే రెడ్.  గత నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 9న విడుదలకావాల్సి ఉంది కానీ కరోనా వల్ల   ఆ విడుదల వాయిదాపడింది. రెడ్ యాక్షన్ థ్రిల్లర్ కావడం తో  ఈ సినిమా తరువాత రామ్ ,కామెడీ ఎంటర్ టైనర్ సబ్జెక్టు కోసం చూస్తున్నాడు. అందుకు తగ్గట్లే గత ఏడాది  ప్రతి రోజు పండగే తో బ్లాక్ బాస్టర్ హిట్  కొట్టిన డైరెక్టర్ మారుతి లైన్లో కి వచ్చాడు. ఇటీవల ఫోన్ లో మారుతి, ,రామ్ కు కథ వినిపించగా రామ్ ఆ కథ నచ్చలేదని చెప్పేశాడట దాంతో మారుతి ప్రస్తుతం మరో హీరో కోసం వెతుకుతున్నాడు. రామ్ ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలనుకుంటున్నాడట. మరి రామ్ ను ఏ డైరెక్టర్ ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.
 
ఇదిలావుంటే  రెడ్ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. దీని పై స్పందించిన రామ్ .. రెడ్  ఖచ్చితంగా థియేటర్లలో విడుదలవుతుందని ఫ్యాన్స్ కు భరోసా ఇస్తున్నాడు అయితే ఈ సినిమా పై పెద్దగా బజ్ లేదు దాంతో  ఫ్యాన్సీ రేటు కింద ఓటిటి కి ఇచ్చేస్తే  బెటర్ ఏమోననే ఆలోచనలో వున్నాడట నిర్మాత స్రవంతి రవి కిషోర్. చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ సరసన మాళవిక శర్మ, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: