మెగా క్యాంప్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటున్నాడు. నాగబాబు తనయుడిగా కొణిదెల ఇంటి రెండో వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. మెగా హీరోల బ్రాండ్ అయిన మాస్ ఇమేజ్ కు దూరంగా నటుడిగా తనలోని కోణాల్ని స్వయంగా బయటకు తెచ్చుకుంటున్నాడు. గద్దలకొండ గణేశ్ తో హిట్ కొట్టిన వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యమున్న సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. నిన్న ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన వరుణ్ ఓ ఆసక్తికరమైన న్యూస్ రివీల్ చేశాడు.

 

 

తన బావ సాయి ధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ చేసే అవకాశాలు ఉన్నాయని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇందుకు తాను కూడా వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం కథ కూడా సిద్ధమవుతోందనే సంకేతాలు ఇచ్చాడు. ఈ న్యూస్ తో మెగా అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది. దర్శక, నిర్మాతలు కూడా వీరితో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వీరిద్దరికి తగ్గ కథ కుదిరితే మంచి మల్టీస్టారర్ సినిమా ఖాయమే. ఇద్దరూ సరిసమానమైన ఇమేజ్ ఉండడం ఇక్కడ ప్లస్ పాయింట్. ఎలాగూ మెగాభిమానుల అందడదండలు ఉండనే ఉన్నాయి.

 

 

చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వాత మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను వీరిద్దరూ నిలబెట్టారు. ఎవరి టాలెంట్ తో వారు సినిమాల్లో సక్సెస్ అయ్యారు. మెగా ఫ్యామిలీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వీరిద్దరూ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫుల్ సపోర్ట్ తో వచ్చిన వారే. ప్రస్తుతం మల్టీస్టారర్ కథలకు తెలుగులో డిమాండ్ బాగానే ఉంది. ఈదశలో వీరిద్దరికి తగ్గ కథ సిద్దమైతే ఫ్యాన్స్ కు పండగే. మరి ఈ మెగా హీరోలకు తగ్గ కథను ఎవరు రాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: