యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో బ్యూటి ఫుల్ లవ్‌స్టోరీగా రాధాకృష్ణ కుమార్  తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం.

 

అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. మహానటి తర్వాత అందరూ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమాని తెరకెక్కిస్తాడని అనుకున్నారు. కాని నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ తో కమిటయ్యాడు. ఇక ఈ సినిమాని డిసెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయిందని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించే అవకాశాలున్నాయని సమాచారం.

 

పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమాని అదే స్థాయిలో నిర్మించనున్నారట. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్స్ కలి రావడం లేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. సాహో లో శద్ద కపూర్ ని తీసుకున్నప్పటికి ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

 

అంతేకాదు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన జాక్విలిన్ ఫెర్నాండెస్ కూడా మైనస్ అయింది. అందుకే హీరోయిన్ విషయంలో ఆలోచించమని ప్రభాస్ కి సలహా ఇస్తున్నారట సన్నిహితులు. అంతేకాదు దీపికా పదుకొనే అయితే బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా అటుంచితే కరోనా దెబ్బకి 2020 నుండి 2021 కి జంప్ అయ్యారని మాట్లాడుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: