తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్.1 కమెడియన్ ఎవరని ప్రశ్నిస్తే వెన్నెల కిషోర్ పేరు నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. నిర్మాతలు తన కాల్షీట్ కోసం తెగ ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రస్తుతం భారతదేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వెన్నెల కిషోర్ జీవితంలో మొట్టమొదటిసారిగా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తినే నోరు తిరిగే కాలు ఆగదు అంటారు మరి ఎప్పుడూ సూపర్ బిజీగా ఉండే వెన్నల కిషోర్ లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండగలుగుతున్నారా అని అడిగితే? ఎందుకు ఉండలేనండి, నిజానికి నేను ఎప్పటినుంచో ఓ విరామం కోసం వేచి చూస్తున్నా అంటూ సమాధానమిచ్చాడు సదరు కమెడియన్.


మీకు ఎక్కువగా బయట తినే అలవాటు ఉంది కదా మరి ఇప్పుడు కేవలం ఇంటి వంటలు తినాల్సి వస్తుంది కదా! అని అడిగితే... 'ఇంటి వంట అంటేనే నాకు బాగా ఇష్టం. ప్రస్తుతం నేను రోజుకి ఒక ఫుల్ మీల్స్ భోజనం చేస్తున్నాను. మిగతా సమయంలో పండ్లను తింటున్నాను. రాత్రివేళ ఫాస్టింగ్ చేస్తున్నాను. కరోనా పుణ్యమా అని నాలో ఉన్న కొవ్వు బాగా కరుగుతుంది. లాక్ డౌన్ తర్వాత నేను నెయ్యి కలిపిన పప్పు బువ్వ, బాగా వేయించిన ఆలుగడ్డ ఫ్రై తో భోజనం చేస్తున్నాను' అని వెన్నెల కిషోర్ అన్నారు.


మీతో ఎవరైనా ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ లో ఉంటున్నారా? అని ప్రశ్నిస్తే... 'నాకు ఆన్లైన్ లో స్నేహితులతో గడపడం అస్సలు ఇష్టం ఉండదు. వీడియో కాల్ లాంటివి కూడా నేను అసలు ఇష్టపడను. ప్రస్తుతం నాతో పాటు మా కుటుంబ సభ్యులంతా ఉంటున్నారు. వారితో కలసి రాత్రి 12:00 వరకు సినిమాలు, హోం బిఫోర్ డార్క్, ఓజార్కు వెబ్ సిరీస్స్ చూస్తూ సమయం గడుపుతున్నాను. మళ్లీ ఉదయం పూట లేటుగా నిద్ర లేచి యోగా కూడా చేస్తున్నాను. నేను యోగా చేయడం స్టార్ట్ చేసి ఇప్పటివరకు 22 రోజులు కావస్తోంది.' అని ఆయన అన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: