మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఎవరికి వారే తమ టాలెంట్ చూపిస్తూ వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాకి క్రేజ్ తెచ్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ఆయన నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రజాభిమానం నిండుగా ఉంది.  మాస్ ఫాలోయింగ్ లో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు.  ఇక పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయి వారి స్టైల్ తో మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్  పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మూవీస్ తో మంచి విజయాలు అందుకున్నాడు.  ఆ తర్వాత మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.

 

క్రిష్ దర్శకత్వంలో కంచె మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దల కొండ గణేష్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు బాక్సర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. దాంతో షూటింగ్స్అన్నీ వాయిదా వేశారు.  లాక్‌డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా   అభిమానులతో టచ్‌లోకి వచ్చాడు. వారు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.

 

 `పవన్‌కల్యాణ్ సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది?` అని ఓ నెటిజన్ వరుణ్‌ను ప్రశ్నించాడు. చిన్నప్పటి నుంచి బాబాయి నటించిన తమ్ముడు సినిమాల అంటే ఎంతో ఇష్టం.. ఈ మూవీలో పవన్ బాబాయ్ స్టంట్స్ అదిరిపోయేలా ఉంటాయి. ఆ సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు` అని చెప్పాడు. అలాగే మంచి కథ దొరికితే సాయితేజ్‌తో మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇక, లాక్‌డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత తన పదో సినిమా గురించిన అప్‌డేట్ వస్తుందని తెలిపాడు

 

మరింత సమాచారం తెలుసుకోండి: