బాలయ్య టాలీవుడ్లో టాప్ హీరో. ఆయన తన పనేంటో తన సినిమాలు ఏంటో అన్నట్లుగా ఉంటారు. ఆయన అసలు మీడియా ముందుకు కూడా రారు. తన గురించి పెద్దగా ప్రచారం కూడా చేసుకోరు. ఆయన ఒక  పరిధి పెట్టుకుని అక్కడే ఉంటారు.

 

నిజంగా ఓ లెజెండ్ ఫ్యామిలీ నుంచి వచ్చి తాను కూడా ఉన్నత శిఖరాల మీద ఉంటూ ఇంతలా సైలెంట్ గా ఉండడం అంటే బాలయ్యకే సొంతం అనుకోవాలి. అయితే బాలయ్య మీడియా ముందుకు రాకపొవడం వల్ల ఆయన గురిచి మెయిన్ స్ట్రీమ్  మీడియాతో పాటు, సోషల్ మీడియాలో కూడా తోచినది రాసేసి ఇమేజ్ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

 

ఇప్పటిదాకా బోయపాటి సినిమాలో బాలయ్యకు హీరోయిన్ దొరకలేదని ప్రచారం చేశారు. దాని మీద బోయపాటి వివరణ ఇచ్చి నోళ్ళు మూయించాడు. తాం ఎవరినీ అసలు సంప్రదించలేదని కూడా చెప్పేశాడు. బాలయ్య పక్కన కొత్త హీరోయిన్ నటిస్తుందని కూడా అసలు న్యూస్ అఫీషియల్ గా బయటపెట్టాడు.

 

ఇపుడు ఇలాంటిదే మరోటి ప్రచారం అవుతోంది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటరీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్న  సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలకృష్ణ, రానా దగ్గుబాటితో రీమేక్ చేయాలని చూస్తున్నారన్న‌ది ఆ ప్రచారం.

 

సరే అది అలా ఉండగానే ఇపుడు ఆ మూవీలో నుంచి బాలయ్యని పక్కన పెట్టి వెంకటేష్ ని ముందుకు తెచ్చారని అంటున్నారు. నిజానికి బాలయ్యని ఆ పాత్రకు అడిగింది ఎంత నిజం. ఆయనని పక్కన పెట్టిందన్నది ఎంత నిజం అని కూడా నందమూరి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి బాలయ్య సరేనంటే చేసేందుకు ఎందరో నిర్మాతలు రెడీగా ఇప్పటికీ ఉన్నారని, బాలయ్య వద్దకు ఏ ప్రపోజల్ వచ్చినా ఆయన వెంటనే ఎస్ ఆర్ నో చెబుతారని కూడా అంటున్నారు.

 

నిజానికి రీమేకులకు బాలయ్య దూరం. అందువల్ల ఆయన ఈ సినిమా ప్రపోజల్ కి  ఒప్పుకోకపోయి ఉండొచ్చని కూడా అంటున్నారు. కానీ బాలయ్యని తప్పించారని షాకింగ్ న్యూస్ రాయడమేంటని ఫ్యాన్స్ మండుతున్నారు. పాపం బాలయ్య అతి మంచితనం వల్లనే ఇలా జరుగుతోందనుకోవాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: