టాలీవుడ్ మన్మథుడుగా పేర తెచ్చుకున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం బుల్లితెర, వెండి తెరపై జోష్ కొనసాగిస్తున్నారు.  రొమాంటిమ్, యాక్షన్, కామెడీ తరహా మూవీలేకాదు భక్తిరస చిత్రాల్లో సైతం నటించి మెప్పించారు.  ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  జోష్ మూవీతో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య తర్వాత ‘ఏం మాయ చేసావే’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  ఇందులో నటించిన తన సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ఈ జంట కలిసి నటించిన ‘మనం’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో అక్కినేని మూడు తరాల నటులు నటించారు.  

 

నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య.  ఈ మూవీ సక్సెస్ తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్ తో మరో మూవీకి ప్లాన్ చేయాలని చూశారు.. కానీ అతి పట్టాలేక్కలేదు.  మజిలీ, వెంకిమామ మూవీస్ తో మంచి విజయం అందుకున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ చేసిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వరరావ్' చేయవలసి వుంది.  ఆ తర్వాత గీతాగోవిందం ఫేమ్ పరుశరామ్ తో మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ నాగేశ్వరరావు గా అనకుంటున్నారు. ప్రస్తుతం పరుశరామ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ మూవీ తిస్తున్నారు.  

 

దాంతో  'నాగేశ్వరరావ్' సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయమే వుంది. ఈ లోగా చైతూని విక్రమ్ కుమార్ సంప్రదిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేసింది. చైతూకి కథ నచ్చితే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలు వున్నాయనే ప్రచారం జరిగింది. కథ నచ్చడంతో విక్రమ్ కుమార్ కి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. విభిన్నమైన కథనాలతో విక్రమ్ కుమార్ సినిమాలు తెరకెక్కిస్తారు. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంతో పాటు, మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: