పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకున్న క్రేజే వేరు. ఆయన ఎన్ని సినిమాల్లో నటించినా హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ అలా కొనసాగుతుందని చెప్పాలి. అలాగే ఆయన ప్రస్తుతం నటించేది రీమేక్ సినిమా అయినప్పటికీ అందులో పవన్ నటిస్తున్నాడంటే చాలు ఆ సినిమా క్రేజే వేరుంటది. ఇక దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన వకీల్సాబ్లో నటిస్తున్నారు. అయితే కరోనా వల్ల షూటింగ్కి కాస్త గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. లేదంటే ఈ పాటికి షూటింగ్ పూర్తయి సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉండేది. మరి ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. ఇక ఆయన ఆఖరుగా నటించిన చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి చిత్రం.
ఇక ఇదిలా ఉంటే పవన్ ఓసారి ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ఆయన ఫ్యాన్స్ పవన్ స్టేజ్ ఎక్కగానే ఒక సినిమా డైలాగ్ చెప్పమని కోరగా ఆయన ఒక మాట అన్నారు. నేను డైలాగులు సినిమాల వరకు చెపుతానుకాని నిజజీవితంలో చెప్పడం నాకు ఇష్టం ఉండదు అన్నారు. ఈ విషయం మాత్రం దయచేసి నన్ను అర్ధం చేసుకోగలరు అన్నారు. అయితే ఆయన నేను నటించిన జానీ సినిమా కనుక హిట్ అయి ఉంటే ఇక సినిమాలు చేయడం ఆపేసేవాడ్ని అన్నారు. అలాగే ఆ సినిమా హిట్ కాకపోవడానికి ప్రధాన కారణమేమిటంటే...నాకు పర్సనల్ జీవితంలో కొన్ని సమస్యలు ఉండేవి. దాంతో నేను సినిమాలు చేస్తున్నా పెద్దగా సంతోషంగా ఉండేవాడ్ని కాదు అన్నారు. కొంచం వైరాగ్యంతో ఉండేవాడ్ని అయితే సినిమాలతో నాకున్న క్రేజ్ని ఉపయోగించి సినిమాల ద్వారా ప్రజా సమస్యలన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సినిమాలు ఉపయోగపడ్డాయి. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. అందుకే నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందుకు కుదిరినంత వరకు నేను సినిమాల్లో నటిస్తాను. నాకు ఓపిక ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తాను. అలాగే బాధ్యతలు ఎక్కువయినప్పుడు సినిమాలకు కాస్త కొంత కాలం దూరం అయితే ఉన్నాను కాని సినిమాలంటే అయిఇష్టం అయితే లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇ ష్టం అన్నారు.