ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ సినిమాని దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత ఈ సినిమా ద్వారా మెగాస్టార్ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. 

Chiranjeevi's next with Koratala Siva announces release date | Box ...

ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నట్లు గా ఇటీవల వార్తలు రావడం జరిగింది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లే అని కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ తేల్చేసారు. అయితే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకునే ఛాన్స్ ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే నేడు ఒక ఇంటర్వ్యూ లో కొరటాలశివ తన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి గారితో తీస్తున్న ఆచార్య సినిమా 40% షూటింగ్ పూర్తి చేసుకుందని, మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంతో బాగుంటుందని, కాగా ప్రస్తుతం సినిమాలో ఆయన ప్రక్కన జోడిగా నటించే హీరోయిన్ కోసం వేట కొనసాగుతోందని అన్నారు. 

 

తాను రాబోయే మరొక ఐదేళ్ల తరువాత సినిమాల నుండి రిటైర్ అవుతానని, మనిషిగా పుట్టిన తరువాత సామాజానికి ఎంతో కొంత చేయాలనేది తన తపన అని, అందుకే తన సినిమాలు అన్ని కూడా సామజిక అంశాలతో ముడి పడి ఉంటాయని తెలిపారు శివ. డైరెక్టర్ గా తన స్థానంలో రాబోయే రోజుల్లో వేరొకరు వస్తారని, సినిమాల నుండి రిటైర్ అయిన తరువాత తనకు వీలైన సామజిక సేవ చేయాలనీ భావిస్తున్నట్లు శివ అన్నారు. ఈ ఐదేళ్లలో వీలైనన్ని సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: