తెలుగు బుల్లితెరపై కామెడీ ప్రోగ్రామ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది జబర్ధస్త్.  ఏడేళ్ల క్రితం ఈ జబర్ధస్త్ జర్నీ మొదలైంది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది.  జబర్ధస్త్ లో నటించిన ఎంతో మంది నటులు ఇప్పుడు వెండితెరపై మంచి కమెడియన్లు గా కొనసాగుతున్నారు. అంతేకాదు ఇతర ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మి తెలుగు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు.  జబర్ధస్త్ కామెడీ షో ఏడేళ్ల నుంచి  మెగాబ్రదర్ నాగబాబు, ఎమ్మెల్యే, నటి రోజాలు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

 

 జబర్ధస్త్ లో స్కిట్స్ చేసి కమెడియన్లు ఎంతగా మెప్పిస్తారు.. అదే స్థాయిలో జడ్జీలు కూడా తమ ఎంటర్ టైన్ మెంట్ తో సందడి చేసేవారు.  అలాంటిది జబర్ధస్త్ కి మెగాబ్రదర్ నాగబాబు గుడ్ బాయ్ చెప్పారు. ప్రస్తుతం నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’ కామెడీ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా జబర్ధస్త్ లో ముక్కు అవినాష్ కి నాగబాబు పంచ్ వేశారు.  బబర్ధస్త్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,  సాయికుమార్ వంటివారిని ఎక్కువగా అనుకరిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడం అవినాశ్ ప్రత్యేకత. తాజాగా నాగబాబు తన యూ ట్యూబ్ చానల్లో లైవ్ చాట్ చేస్తూ ఉండగా, టచ్ లోకి వచ్చిన అవినాశ్, 'నేను మాట్లాడుతున్నది వరుణ్ తేజ్ తోనా? నాగబాబుగారితోనా? అర్థం కావడం లేదు' అన్నాడు.

 

 అంతే నాబాబు అరేయ్ బాబూ.. నేను జబర్ధస్త్ లో పనిచేయడం లేదురా.. నాకు బిస్కెట్లు వేయడం వలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వెళ్లి శేఖర్ మాస్టర్ కో .. రోజాకో వేసుకో బిస్కెట్ వేస్తే ప్రయోజనం ఉంటుందని అన్నారు.  అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినా.. తానెప్పుడూ ఎవరినీ వ్యతిరేకించలేదని.. అందరూ తనకు ఆత్మీయులే అని అంటున్నారు నాగబాబు. తనకి ఎవరిపై శత్రుత్వం .. పగ .. ప్రతీకారాలు ఉండవనీ, ఎవరి అవకాశాలు వారివని ఇదే లైవ్ చాట్ లో ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: