తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. ఆయన సినిమాలు అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. కథ బాగుంటే నే ఆయన సినిమాలు చేస్తారు అనేది కొందరి మాట. అందుకే ప్రేక్షకులు కూడా ఆయన సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అని అంటూ ఉంటారు. దిల్ రాజు సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి, మహేష్ బాబు తో ఆయన చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ అయింది. 

 

శర్వా సమంతా హీరో హీరోయిన్స్ గా వచ్చిన జాను సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనిపై దిల్ రాజు ఇప్పుడు అసహనంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక నుంచి ఆయన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. చిన్న హీరోలతో పాటుగా చిన్న చిన్న దర్శకులతో సినిమాలు చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించుకుని చెయ్యాలి అని దిల్ రాజు భావిస్తున్నారట. ఈ మధ్య కాలంలో ఆయన దాదాపు 50 కోట్ల వరకు నష్టపోయారు అనేది టాలీవుడ్ లో ఉన్న టాక్. 

 

అందుకే ఆయన ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. దిల్ రాజు ఇప్పుడు అగ్ర హీరోలతో సినిమా చేసే సమయంలో గుడ్డిగా వెళ్ళవద్దు అని భావిస్తున్నారు. ఇక ఒకటి రెండు పెద్ద కుటుంబాలను పక్కన పెట్టాలి అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. అనవసరంగా పెట్టుబడి పెట్టి నష్టపోవద్దు అని ఆయన ఆవేదనగా ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయన తో సినిమా అనగానే కొంత మంది దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్లకు కూడా ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. చూడాలి మరి ఎవరితో సినిమా చేస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: