టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ ప్రస్తుతం లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే.. మహేశ్ తప్ప దాదాపు అందరు హీరోల సినిమాలు షూటింగ్ జరుపుకోవటమో.. విడుదలకు రెడీగానో ఉన్నాయి. కరోనా కల్లోలానికి షూటింగులు, రిలీజ్ లు వాయిదా పడిపోయాయి. ఆ టెన్షన్ మహేశ్ కు లేకపోవడంతో ప్రస్తుతం ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్టుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరక్టర్ పరశురామ్ తో మహేశ్ తన తర్వాతి ప్రాజెక్టు చేస్తున్నాడని సమాచారం.

 

 

అయితే ఈ సినిమా విషయంలో మహేశ్ పూర్తిగా పరశురామ్ కే చాయిస్ ఇస్తున్నాడని సమాచారం. ఇందులో ముఖ్యంగా సినిమా సంగీతం విషయంలో మహేశ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గీత గోవిందంకు మ్యూజిక్ ఇచ్చిన గోపీ సుందర్ నే తీసుకోవాలని పరశురాంకు సూచించినట్టు ఫిలిం నగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో గోపీ సుందర్ సంగీతం ఎంత ముఖ్య పాత్ర పోషించిందో తెలిసిన విషయమే. సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ అయింది. గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కూడా సినిమాకు ప్లస్ అయి ఆడియన్స్ ను సినిమాకు కనెక్ట్ చేసింది.

 

 

గీత గోవిందం పాటలకు ఫిదా అయిపోయిన మహేశ్ ఈ ప్రాజెక్టుకు గోపీ సుందర్ పైనే నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పరశురాంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ పరిస్థితులు చక్కబడ్డాక సినిమా షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం వైరల్ అయిన ఈ న్యూస్ పై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: