సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్ లను వెతకడం అనేది దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. చాలా మంది హీరోయిన్ లు... ఇప్పుడు సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకి వచ్చే పరిస్థితి అసలు కనపడటం లేదు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు. చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాలో కూడా హీరోయిన్ ఎంపిక అనేది ఇప్పుడు సవాల్ గా మారింది. ముందు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వెనక్కు తగ్గడం టాలీవుడ్ లో అనేక చర్చలకు దారి తీస్తుంది. ఒప్పుకున్నా వాళ్ళు కూడా వెనక్కు తగ్గుతున్నారు. 

 

చాలా మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించినా సరే సినిమా చేయడానికి మాత్రం ఎవరూ ముందుకి రావడం లేదు. ప్రస్తుతం కాజల్ ని ఫైనల్ చేసారు అని అంటున్నారు. అంతక ముందు త్రిష అనుష్క పేర్లను పరిశీలించగా వాళ్ళు సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. దానికి కారణం చిరంజీవి పక్కన వాళ్ళు చిన్నగా కనపడటమే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి పక్కన సీనియర్ హీరోయిన్ నయనతారను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. నయనతార ఒప్పుకుందని షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ గా ఉందని అంటున్నారు. 

 

ఆమె ఈ సినిమా షూటింగ్ లో కరోనా ప్రభావం తర్వాత పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమెకు దాదాపుగా ఈ సినిమా కోసం రెండు కోట్ల వరకు ఇస్తున్నారు అని తమిళంలో ప్రచార బాధ్యతలు అన్నీ కూడా ఆమె చూసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. దీనితో అంత మొత్తం ఆమెకు ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నయనతార అక్కడ సినిమాలతో బిజీ గా ఉంది. అయినా సరే ఈ సినిమా షూటింగ్ కి ఆమె ఓకే చెప్పింది. మరి చెప్పిన తేదీ కి ఆమె షూటింగ్ కి వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: