మిర్చి తో డైరెక్టర్ గా మారి ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా లేకుండా దూసుకుపోతున్నాడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మిర్చి తరువాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ ,భరత్ అనే నేను ఇలా అన్ని బ్లాక్ బాస్టర్ హిట్లే ఇచ్చాడు ఈ దర్శకుడు. సోషల్ మెసేజ్ ను కమర్షియల్ యాంగిల్ లో చెప్పడమే కొరటాల సక్సెస్ సీక్రెట్. ఇక ఈ డైరెక్టర్ ఎప్పుడు రిటైర్ అయ్యేదే చెప్పేశాడు. మరో 5 సంవత్సరాల్లో నేను చేయాలనుకున్న సినిమాలు చేసి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను.. ఆ తరువాత  న్యూ ట్యాలెంట్ తో నా స్థానం భర్తీ అవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. గతంలో కూడా నా దగ్గర కేవలం 10 కథలే వున్నాయి వాటిని పూర్తి చేసి సినిమాలను మానేస్తానని కొరటాల అన్నాడు.  ఇక అలాగే కొరటాల శివ, ఆచార్య గురించి కూడా స్పదించాడు. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం రామ్ చరణ్  కు హీరోయిన్ ను వెతికే  పనిలో ఉన్నామని వెల్లడించాడు. 
 
మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో కాజల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ,సోనూసూద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో  చిరు నక్సలైట్ గా కనిపించనుండగా రామ్ చరణ్ అతనికి గురువుగా నటించనున్నాడు. చరణ్సినిమా కోసం 30 రోజుల డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి,సూపర్ హిట్ మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: