లక్ష్మీప్రణతి నందమూరి. యంగ్టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. తన అత్త షాలిని గురించి మాట్లాడుతూ...పెళ్ళయిన కొత్తలో నాకు నా భర్త ఎన్టీఆర్తో మాట్లాడటానికి కొంచం టెన్షన్ వచ్చేది. ఇక మావయ్యతో మాట్లాడటం అంటే ఇంకా భయం. అయితే అత్తయ్యగారు ఎంతో ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుని నా టెన్షన్ని భయాన్ని దూరం చేశారు. తర్వాత మావయ్యగారు కూడా చాలా ఫ్రీగా మాట్లాడేవారు. ఇప్పటికీ అత్తయ్య నా భర్త కంటే కూడా నాపైనే ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. అంటూ చెప్పుకొచ్చింది. లక్ష్మీప్రణతి తను చిన్న తనం నుంచి హైదరాబాద్లోనే ఉంది. తన చదువు మొత్తం కూడా ఇక్కడే పూర్తి చేసింది. అలాగే ప్రణతి ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. స్వతహాగా ప్రణతి చాలా మితభాషి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అయితే తన ఫ్రెండ్స్, భర్త మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారని ఆమె సన్నిహితులు సమాచారమిస్తుంటారు.
అలాగే భర్త ఎన్టీఆర్తో కలిసి వీలు దొరికినప్పుడల్లా కొత్త సినిమాలు వీక్షించే అలవాటు ఉన్న ప్రణతి. అత్తయ్య షాలినితో ఎంతో మమేకమవుతారట. ఇక ఇటీవలె తన మావయ్య హరికృష్ణ మరణానంతరం భర్త, అత్తయ్యలకు ఎంతో చేదోడు వాదోడుగా నిలిచిన ప్రణతి తన కుమారులను ఎంతో ప్రేమగా బాధ్యతగా పెంచుతారట. అంతేకాక లక్ష్మీ ప్రణతి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్వయాన మేనకోడలు కూతురు. ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య పది సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినప్పటికీ వీరిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఒకరు అభయ్రామ్.
మరొకరు భార్గవ్రామ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో మాత్రం కచ్చితంగా భార్య మాట వినాల్సిందేనట. ఆ మాటకా వస్తే ఎంతటి మగవారైనా పెళ్ళయ్యాక భార్య ముందు తలవంచాల్సిందేనని చాలా మంది చెబుతుంటారు. లక్ష్మీప్రణతి ఓసారి ఎన్టీఆర్ పైన సీరియస్ అయిందట. ఎందుకంటే ఓసారి అభయ్రామ్కి స్నానం చేయిస్తుండగా ఎన్టీఆర్ చేతిలోంచి జారి పడడంతో అభయ్కి చిన్న గాయమయిందట. దీంతో అజాగ్రత్తగా వ్యవహరించారంటూ భర్తపైన ప్రణతి బాగా సీరియస్ అయిందట.