తెలుగులో కియారా అద్వాని నటించిన మొదటి సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది కియారా అద్వాని. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలోను ఛాన్స్ దక్కించుకుంది. కాని ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ ప్రభావం కియారా మీద టాలీవుడ్ లో  పడిందేమోగాని బాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

 

బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో తీసిన లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసింది కియారా అద్వాని. ఈ వెబ్ సిరీస్ లో కూడా రాధికా ఆప్టే, మనీషా కోయిరాల, నేహా ధూపియా, సంజయ్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా పాపులర్ అయింది మాత్రం కియారా అద్వానినే. ఆ తర్వాత తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరసగా స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. 

 

ఇక ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా అద్వాని. వరుస విజయాలతో మాంచి ఫాం లో ఉన్న సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అక్షయ్ కి జంటగా నటిస్తుంది. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది. కాంచన కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

 

అయితే ఈ పాత్రలో కియారా ఎలా నటిస్తుందో బాలీవుడ్ లో కొందరు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారట. లక్ష్మీ బాంబ్ లో కీఅయారా పోషిస్తుంది ఛాలెంజింగ్ రోల్ కావడం తో లక్ష్మీ రాయ్ ని మ్యాచ్ చేయగలుగుతుందా అని మాట్లాడుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: