రజ్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా సక్సస్ అందుకున్నాడు సుజీత్. శర్వానంద్ సీరత్ కపూర్ జంటగా తెరకెక్కించిన ఈ సినిమా ని యు వి క్రియోషన్స్ బ్యానర్ మీద వంశీ ప్రమోద్ నిర్మించారు. అదే సమయం లో ప్రభాస్ ని మైండ్ లో పెట్టుకొని సుజీత్ సాహో కథ సిద్దం చేసుకున్నాడు. ఈ కథ యు వి వాళ్ళకి నచ్చడం తో ప్రభాస్ కి వినిపించమని చెప్పారు. దాంతో ప్రభాస్ కి చెప్పి ఇంప్రెస్ చేశాడు సుజీత్. బాహుబలి సినిమాతో బిజీగా ఉన్నప్పటికి ప్రభాస్ కోసం రెండేళ్ళు ఆగాడు. ఆ తర్వాత రెండేళ్ళు పైనే సాహో సినిమాని తీశాడు. ఇండస్ట్రీలో అందరూ షాకయ్యోలా ప్రభాస్ మీద టీజర్ కట్ చేసి బాహుబలి కన్‌క్లూజన్ రిలీజ్ రోజునుండే ప్రచారం మొదలు పెట్టాడు. 

 

అప్పటి వరకు సుజీత్ అంటే రన్ రాజా రన్ డైరెక్టర్ అని మాత్రమే తెలిసిన ఇండస్ట్రీవాళ్ళకి సాహో టీజర్ తో చూడటానికి చిన్నవాడైనా స్టార్ డైరెక్టర్ లా ఉన్నాడే అన్న కామెంట్స్ ని అందుకున్నాడు. సాహో సినిమా జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్ గురించి ఎంత హాట్ టాపిక్ అయిందో డైరెకటర్ సుజీత్ గురించి అంతే హాట్ టాపిక్ అయింది. రెండవ సినిమానే 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమా తీస్తున్నందుకు అందరూ అవాక్కాయ్యారు.

 

ఇక సినిమా రిలీజయ్యాక రిజల్ట్ మరియు కలెక్షన్స్ మాట ఎలా ఉన్నా ప్రభాస్ ని స్క్రీన్ మీద చూపించినదానికి తెలుగు తో పాటు సౌత్ లో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. బాహుబలి తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ని ఆ రేంజ్ లో చూపించినందుకు సుజీత్ ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.

 

దాంతో ఇండస్ట్రీ మొత్తం సుజీత్ పేరు మార్మోగిపోయింది. కాని మళ్ళీ సినిమా మాత్రం రానేలేదు. సాహో వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఏ హీరో పిలిచి సినిమా చేద్దామని అనలేదట. అయినా కూడా స్టార్ హీరోలని దృష్ఠిలో పెట్టుకొనే సుజీత్ కథలను సిద్దం చేసుకుంటున్నాడు. ఈ లోపు మేగాస్టార్ అండ్ రాం చరణ్ సుజీత్ కి షాకిచ్చారు. మళయాళం లో మొహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ బాధ్యతలు సుజీత్ కి అప్పగించి ఇండస్ట్రీలో చాలామందికి షాకిచ్చారు చిరు.

 

ఇది అసలు ఎవరూ ఊహించనిది. త్వరలో మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్న ఎగ్జైట్‌మెంట్ లో సుజీత్ ఉన్నాడు. అయితే కొంతమంది మాత్రం సుజీత్ మూడో సినిమాకే మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడా ...అంటూ గుండెలు బాదుకుంటున్నారట ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: