పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , వకీల్ సాబ్ తో సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నామని చిత్ర బృందం అంటుంటే ఆమె మాత్రం నేను ఈ సినిమా చేయడం లేదని అనేసింది. నిజానికి  శృతిసినిమా కోసం అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసిందట మరి ఇప్పుడు ఇలా అనడం చిత్ర బృందాన్ని కన్ఫ్యూజన్ లో  పడేసింది. అయితే తన పాత్ర కుదించడంతోనే శృతి ఈ నిర్ణయం తీసుకుందని టాక్. త్వరలోనే ఈ విషయం లో ఓ క్లారిటీ రానుంది.  
 
ఇదిలావుంటే కరోనా లేకుంటే ఈపాటికి వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అవుతుండేది  కానీ కరోనా వల్ల లాక్ డౌన్ అమల్లోకి రావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది దాంతో మే లో విడుదలకావాల్సిన ఈచిత్రం దసరా కు వెళ్ళిపోయింది.  వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా యువ హీరోయిన్లు అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇక ఈచిత్రం తో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27 వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఇటివలే సెట్స్ మీదకు వెళ్లగా  ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారం లో వుంది.  భారీ బడ్జెట్ తో మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో విడుదలకానుంది. ఈ సినిమా తరువాత పవన్ ,హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరోసారి నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: