ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం - హీరో మాధ‌వ్ కాంబోలో వ‌చ్చిన స‌ఖి సినిమా వ‌చ్చి ఇర‌వై సంవ‌త్స‌రాలు అయ్యింది. మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఇంటి ద‌గ్గ‌రే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తొలిసారి ఇన్‌స్టా గ్రామ్ లైవ్‌లో మాట్లాడారు. త‌న భార్య అయిన సీనియ‌ర్ న‌టి సుహాసిని ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా లైవ్లో మాట్లాడిన మ‌ణిర‌త్నం త‌న అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చి వారిని సంతోషింప చేశారు. ఈ లైవ్‌లోనే హీరోయిన్లు అతిధి రావు హైద‌రీ, ఖుష్బూ త‌దిత‌రులు కూడా మాట్లాడారు. ఈ క్ర‌మంలో మ‌ణిర‌త్నం దంప‌తులు - హీరో మాధ‌వ్‌కు మ‌ధ్య ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంభాష‌ణ‌లు జ‌రిగాయి.

 

సినిమా షూటింగ్ టైంలో మాధ‌వ‌న్ త‌న భ‌ర్త మ‌ణిర‌త్నంకు గోల్ఫ్ ఆట నేర్పి ఆయ‌న జీవితాన్ని మార్చేశార‌ని సుహాసిని చెప్పింది. ఈ క్ర‌మంలోనే స‌ఖి 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంద‌న్న విష‌యం ఆమె గుర్తు చేసుకుంది. ఈ సినిమాలో ట్రైన్ సీన్ వ‌చ్చిన‌ప్పుడు చాలా కంగారు ప‌డ్డాన‌ని.. ఆ స‌మ‌యంలో కేవ‌లం రెండు రైళ్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని.. చెప్పారు. ఆ త‌ర్వాత న‌టి పూన‌మ్ థిల్లాన్ సాధార‌ణ న‌టుల‌తో అద్భుత‌మైన సినిమాలు తీయ‌డం మీకే సాధ్య‌మ‌ని అన్నారు. ఇక మ‌రో హీరోయిన్ అతిధి రావు హైద‌రీతో మ‌ణి మాట్లాడుతూ ఎవ‌రు అయితే త‌న‌ను ఇబ్బంది పెట్ట‌రో వారినే న‌టులుగా త‌న సినిమాల్లో ఎంపిక చేసుకుంటాన‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: