కొర‌టాల శివ తెలుగులో ప‌రిచ‌యం అక్క‌ర్లేని ద‌ర్శ‌కుడు. కేవ‌లం నాలుగే నాలుగు చిత్రాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌ల జాబితాలో చేరిపోయారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ. ప్ర‌స్తుతం ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ఇది ఆయ‌న ఐద‌వ చిత్రం. మ‌రో ఐదు చిత్రాలు పూర్త‌యితే ద‌ర్శ‌క‌త్వానికి గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నార‌ట‌. అభ్యుద‌య భావాలు గ‌ల కుటుంబం నుంచి వ‌చ్చిన కొర‌టాల సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

 

డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభానికి ముందే ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్టు తెలిసింది. అభ్యుద‌య భావాల్ని త‌న సినిమాల్లో చూపిస్తూ దానికి క‌మర్ష‌య‌ల్ హంగుల‌ను అద్ది. అన్ని చిత్రాల‌ను దాదాపుగా విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్న కొర‌టాల ద‌ర్శ‌క‌త్వానికి గుడ్ బై చెప్పిన త‌రువాత ఇండ‌స్ట్రీలోనే వుంటూ త‌న‌లా ద‌ర్శ‌కుడిగా మారాల‌నుకునే వారికి ఓ నిర్మాత‌గా అవ‌కాశాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇందు కోసం త్వ‌ర‌లోనే ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించాలనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే త‌న మిత్రుడు నిరంజ‌న్‌రెడ్డిని కొర‌టాల నిర్మాత‌గా ప‌రిచ‌యం చేస్తున్నారు. 

 

చిరంజీవి హీరోగా కొర‌టాల తెర‌కెక్కిస్తున్న చిత్రానికి నిరంజ‌న్‌రెడ్డి ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.  మ‌రో నిర్మాత‌గా హీరో రామ్‌చ‌ర‌ణ్ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ముందుగానే ప్లాన్ చేశారు కానీ క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రి ఈ ప్ర‌భావం టాలీవుడ్ మీద కాస్త ఎక్కువ‌గానే ప‌డింద‌ని చెప్పాలి.  మ‌రి ప్ర‌స్తుతం రాబోయే చిరంజీవి చిత్రం ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక కొర‌టాల తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ఆయ‌న ఫ్యాన్స్ పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌రి సినిమాలు తీయ‌డం పై ఆయ‌న నిర్ణ‌యం ఇలానే ఉంటుందా లేక మారుతుందా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: