ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య ఆశించిన స్థాయిలో హిట్ అనుకోలేకపోతున్నాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన రవితేజ గత చిత్రం 'డిస్కోరాజా' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయినా సరే సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు. రవితేజ ప్రస్తుతం కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న 'క్రాక్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాన్‌ శీను, బలుపు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ, గోపిచంద్‌ మలినేనిలు హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.

 

కాగా రవితేజ్ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ అట, అలాగే మరో పాత్ర ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ పాత్ర అట. బిజినెస్ మెన్ పాత్ర కూల్ గా ఉంటే.. పోలీస్ పాత్ర పక్కాగా మాస్ పాత్ర అట. ఇప్పటికే చాలా సినిమాల్లో పోలీస్ గా కనిపించిన మాస్ మహారాజ్ మరోసారి లాఠీ పట్టుకోబోతున్నాడన్నమాట. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రాక్ సినిమాలో కూడా రవితేజ పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం. అలాగే మరో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకోనున్నారు. గతంలో నేల టిక్కెట్టు సినిమాలో మాళవిక రవితేజ సరసన నటించింది. అయితే ఈ సినిమా తమిళ రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.

 

అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. మరి ఈ వరుస సినిమాల ద్వారా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ సినిమాలతో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా తెలుగు రీమేక్ లో కూడా నటించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: