దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  వాస్తవానికి మొన్న 14 న లాక్ డౌన్ ముగియాల్సి ఉన్నా.. దేశంలోకరోనా ఇంకా కట్టడి కాకపోవడంతో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.. ఈ విషయాన్ని ఆ మద్య ప్రధాని మోదీతో వీడియో కాన్ఫిరెన్స్ లో కూడా ప్రస్తావించారు. మొత్తానికి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. 

 

తాజాగా మెగాబ్రదర్ నాగబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ని తెగ ప్రశంస్తున్నారు.  ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశంలో కేసీఆర్  గారిలాంటి లీడర్స్ వజ్రాల్లా మెరుస్తారు" అని ప్రశంసల వర్షం కురిపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: