కరోనా వైరస్ విషయంలో మెగా ఫ్యామిలీ ఎక్కువగా హడావుడి చేస్తుంది అని కొందరు అంటున్నారు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా ఈ వార్తలు మాత్రం ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలీ లో ఉన్న ప్రముఖులు అందరూ కూడా ఒక పోస్టర్ ని విడుదల చేసారు. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే దాన్ని ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించారు. ఇక అక్కడి నుంచి అనేక వార్తలు వస్తున్నాయి దీని మీద. 

 

ఆయనకు ఇప్పుడు బిజెపికి దగ్గర కావాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉందని అంటున్నారు. చిరంజీవి రాజకీయాల మీద ఫోకస్ చేసారు అనేది జనాల మాట. చిరంజీవి ఈ మధ్య కాలంలో దేశం అనే మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు. కరోనా పై పోరాటం విషయంలో తెలుగు రాష్ట్రాలను పక్కన పెట్టిన ఆయన దేశం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు దీని గురించే చర్చలు అన్నీ కూడా. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. 

 

వాళ్ళ ఉద్దేశం మంచిదే అయినా సరే కొన్ని పరిస్థితులు మాత్రం తేడా గా ఉన్నాయి. ఎప్పటి నుంచో బిజెపిలో చేరడానికి మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తుంది. దానికి స్పష్టమైన కారణమా అనేది తెలియదు గాని మెగాస్టార్ మాత్రం బిజెపికి దగ్గర కావడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. చిరంజీవి రాజ్యసభ సీటు ని ఆశించారు. కాని రాలేదు ఇప్పుడు మళ్ళీ దాని కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం కరోనా వైరస్ ని వాడుకునే ప్రయత్నం చిరంజీవి చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: