టాలీవుడ్ లో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కి డిమాండ్ పెరిగిందా... అంటే అవుననే సమాధానం వినపడుతుంది. జాన్వీ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఊపు ఊపుతుంది. నటన అందం అన్ని ఉండటం తో ఆమెతో సినిమా చేయడాని కి గానూ అక్కడి హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఆమెకు అక్కడ అవకాశాలు ఎక్కువగానే వస్తు ఉన్నాయి. ఇక పారితోషికం కూడా ఆమె ఎక్కువగానే వసూలు చేస్తుంది ఇప్పుడు. ఇది పక్కన పెడితే ఆమెతో తెలుగులో సినిమాలు చేయడానికి సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. 

 

జూనియర్ ఎన్టీఆర్ ఆమె తో సినిమా చెయ్యాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఇక మహేష్ బాబు కూడా తన సినిమా సరిలేరు నీకెవ్వరు ఆమె తోనే చెయ్యాలి అనుకున్నాడు. ఇక మరో యువ హీరో శర్వానంద్ కూడా ఆమె తో సినిమా చెయ్యాలి అని ఆసక్తిగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ కూడా జాన్వీ తో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది అన్నారు. అయితే సినిమాలో కొన్ని కారణాలతో ఆమెను పక్కన పెట్టారు అనేది కొందరి టాక్. మహేష్ బాబు సినిమా అనగానే ఆమె కూడా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తుంది అంటున్నారు. 

 

మహేష్ బాబు తర్వాతి సినిమాలో ఆమెను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తాను సినిమా చేస్తున్న దర్శకుడు పరుశురాం కి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమెకు పారితోషికం కూడా భారీగా ఇవ్వడానికి మన టాలీవుడ్ లో కొందరు రెడీ గా ఉన్నారని తెలుస్తుంది. ఆమె పారితోషికం ఎంత అడిగినా సరే నో అనే పరిస్థితి ఇక్కడ లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: