స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో లో రానున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనుండడం తో తెలుగు నుండే కాకుండా పర భాషల నుండి ప్రముఖ నటీనటులను ముఖ్య పాత్రల కోసం తీసుకుంటున్నాడు సుకుమార్. అందులో భాగంగా ఇప్పటికే తమిళ  పాపులర్ యాక్టర్ బాబీ సింహ విలన్ అలాగే కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి  విలన్ పాత్రలకు ఎంపిక కాగా తాజాగా మరో కన్నడ నటుడిని ముఖ్య పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారట.  
 
అతనెవరో కాదో రామ్ గోపాల్ వర్మ భైరవ గీత తో  తెలుగు లోకి పరిచయమైన హీరో ధనంజయ్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని  ధనుంజయ్ కూడా పుష్పలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక కథానాయికగా నటించనుండగా రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా  నిర్మించనున్న ఈ సినిమాలో  బన్ని చిత్తూరు స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నాడు. 
 
ఆర్య సిరీస్ తరువాత సుకుమార్ - బన్ని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం అలాగే రంగస్థలం తో సుకుమార్ అల .. వైకుంఠపురములో తో  బన్నిఇండస్ట్రీ హిట్లు కొట్టడం తో పుష్ప పై  భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ , ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ లో నటించనున్నాడు. దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: