స్టార్ హీరోయిన్ కాజల్ టాలీవుడ్ లో మళ్ళీ బిజీ అవుతుంది. గత కొంత కాలంగా అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్న కాజల్ తాజాగా మూడు సినిమాలకు సైన్ చేసిందట. అందులో  భాగంగా మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ శివ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య లో చిరు కు జోడిగా కాజల్ నటించనుంది. ముందుగా ఈ పాత్ర కు త్రిష ను అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో  కాజల్ కు ఈ ఆఫర్ వచ్చింది. ఈవిషయాన్ని కాజలే స్వయంగా ప్రకటించింది. 
 
ఇక తాజాగా కాజల్ మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈరెండు సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుందట. అందులో మొదటిది.. విక్టరీ వెంకటేష్ తో పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించనుందట. హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈఏడాది ద్వితీయార్ధం లో సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఈ సినిమాతో పాటు లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి కాజల్ ఓకే చెప్పిందట. ఈసినిమాను కూడా సురేష్ ప్రొడక్షన్సే నిర్మించనుంది. అయితే ఈరెండు సినిమాల విషయంలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.
 
ఇదిలావుంటే కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కి కాజల్ తాజాగా రెండు లక్షల విరాళం ప్రకటించింది. అలాగే ఇంతకుముందు కాజల్ ఎఫ్ఈఎఫ్ఎస్ఐ కి రెండు లక్షలు పీఎం కేర్స్ ఫండ్ కు లక్ష ,మహారాష్ట్ర సీఎం ఫండ్ కు లక్ష విరాళం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: