ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు, మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక మిలిటరీ మేజర్ పాత్రలో కనిపించిన మహేష్, చాలా గ్యాప్ తరువాత మంచి ఎంటర్టైన్మెంట్ రోల్ లో నటించి ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. 

 

ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు, మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ కథ పూర్తిగా సిద్ధం కాకపోవడమతొ అతడి స్థానంలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట మహేష్. అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు చెప్తున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న ఒక సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో ఫ్రెష్ లుక్ లో కనపడనున్నారని, తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు పోషించని ఒక వైవిధ్యమైన పాత్రని ఈ సినిమాలో మహేష్ పోస్తిస్తున్నట్లు టాక్. 

 

అలానే ఈ సినిమా మంచి ప్రేమకథ అని, పలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు పరశురామ్ ఈ కథను సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. వాస్తవానికి ఎన్నో ఏళ్ళ క్రితం మహేష్ బాబు అక్కడక్కడా చాలా తక్కువ మాత్రమే లవ్ స్టోరీల్లో నటించారు. కాగా చాలా గ్యాప్ తరువాత మహేష్ బాబు ఈ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుండడం విశేషం అని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడితేనే కానీ దీనిలో నిజానిజాలు నమ్మలేం అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: