మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. భారీ అంచనాల మధ్య ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసందే. ఇక ఈ సినిమా కరోనా కారణంగా నిలిపివేసిన ఈ సినిమా మీద రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరగని కొరటాల సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా క్రేన్ ని సంపాదించుకున్నారు. అందుకే అందరి చూపు ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ చిరంజీవి సినిమా మీదే ఉంది. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  

 

ఇక కొరటల శివ ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాని దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని పకడ్బంధీగా ప్లాన్స్ వేసుకున్నారు. అందుకు కారణం ముందు ఉన్న పరిస్థితులు సినిమాల షెడ్యూల్స్ ప్రకారం ఆ సీజన్ కి వేరే సినిమా లేకపోవడం. అయితే ఇప్పుడు అవన్ని తారుమారు అయ్యాయి. కరోనా కారణంగా కొరటాల మొత్తం ప్లాన్ మారిపోయింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలలోను కొరటాల కంగారు పడుతున్నారని తెలుస్తుంది.  

 

ముఖ్యంగా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి అవకపోవడం ఒక కారణమైతే ఒక సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్సినిమా టైటిల్ రివీల్ చేయడం. దాంతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న కొరటాల కొంత డిసప్పాయింట్ అయ్యారట. అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా కథ ఏంటనేది చిరంజీవి రివీల్ చేసేశారు. ఇది ఫ్యాన్స్ కి కాస్త ఉత్సాహం కలిగించినా కొరటాలకి మాత్రం పరీక్ష లాంటిందే. వాస్తవంగా రాజమౌళి మాదిరిగా కొరటాల ఇప్పటి వరకు తీసిన సినిమాలేవీ కూడా రిలీజ్ కి ముందు కథ ఏంటనేది రివీల్ చేయకుండా సీక్రెట్ మేయిన్‌టైన్ చేశారు. కాని ఈ సారి మాత్రం ఏదో రకంగా ఆచార్య సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా లీకవుతు కొరటాలని డైలమాలో పడేస్తున్నాయి. దీంతో ఇవన్నీ కొరటాలని భయాందోళనకి గురి చేస్తున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: