పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నప్పటికి ఇంకా అఫీషియల్ గా మాత్రం వెల్లడించలేదు. ఇస్మార్ట్ శంకర్ ని నిర్మించినట్టుగానే ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం కొంత టాకీ పార్ట్ షూట్ చేసిన పూరి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

 

ప్యాన్‌ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాలో హీరోయిన్‌ బాలీవుడ్‌ బ్యూటి అయితే బిజినెస్‌ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందులో భాగంగానే ఈ సినిమాలో ముందు జాన్వి కపూర్‌ని తీసుకోవాలని అనుకున్నారు. అయితే చివరికి అనన్య పాండేను తీసుకున్నారు పూరి. 'సాహో' సినిమాలో విలన్ పాత్రలో నటించిన చుంకీ పాండే కూతురయిన అనన్య పాండే బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. గతేడాది బాలీవుడ్‌ వచ్చిన స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనన్య ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వో' సినిమాలో నటించింది. 

 

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టరయినా కూడా ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా సంపాదించుకుంది. అయితే ఇప్పుడు కొంతమంది టాలీవుడ్ హీరోల కన్ను అనన్య మీద పడిందట. అందుకే అనన్య ని తమ సినిమాలో నటింప చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అంతేకాదు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ ని తీసుకునే బదులు అనన్య ని తీసుకుంటే బెటరని ఫీలవుతున్నారట. అంటే ఇది ఖచ్చితంగా పూజా హెగ్డే, రష్మిక లని దృష్ఠిలో పెట్టుకొనే ఇలా మాట్లాడుతున్నారని చర్చ జరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: