స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తో మునుపటి ఫామ్ లోకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరక్షన్ లో అంతకుముందు చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల కన్నా అల వైకుంఠపురములో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత బన్ని ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటుగా తన నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ కూడా మొదలుపెట్టాడు అల్లు అర్జున్. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ ప్రాజెక్ట్ ను బన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. 

 

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ వంగ టాలెంట్ ఏంటో తెలిసింది.. ఆ సినిమాను బాలీవుడ్ లో తీసి అక్కడ సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అక్కడే రణ్ భీర్ కపూర్ తో ఒక సినిమా ప్లాన్ చేయగా అది వర్క్ అవుట్ కాలేదని తెలుస్తుంది. అందుకే మళ్ళీ తెలుగు స్టార్స్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ వంగ. విజయ్ దేవరకొండతోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుండగా అల్లు అర్జున్ కు సరిపోయే కథ సిద్ధం చేశాడట. బన్నీకి ఆల్రెడీ అంతకుముందు లైన్ వినిపించగా డెవలప్ చేయమని చెప్పాడట. 

 

సందీప్ వంగ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. లాక్ డౌన్ ఎత్తేయగానే బన్నీకి పూర్తి కథ వినిపించి సినిమా ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సందీప్ వంగతో సినిమా చేయాలని ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. పుష్ప తర్వాత సందీప్ వంగ సినిమా చేసే ఆలోచనలో ఉన్న బన్నీ ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ తో చేయాలని అంటున్నాడట. అల్లు అర్జున్ తో అర్జున్ రెడ్డి వర్షన్ 2 ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: