కత్తి మహేశ్ సుత్తి సుత్తి మాటలతో ఎప్పుడూ సూటిగా వార్తల్లో నిలుస్తాడు.. వివాదాలనైతే చంకలో పెట్టుకుని తిరుగుతాడు.. అందుకే ఇతని గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు.. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే సినిమా క్రిటిక్ కత్తి మహేశ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అగ్గిపెట్టె డబ్బా గురించి అగ్గిపుల్లలకు పరిచయం అక్కర లేదు కదా.. ఇవి రెండు పక్కనే ఉన్నా అగ్గిపుల్లకు చిర్రెత్తిందనుకో అగ్గిపెట్టను కూడా కాల్చేస్తుంది..

 

 

ఇక మూడు పువ్వులు ఆరు కాయల్లాగా.. ఈ కత్తి ఎవరో ఒకరికి పంచ్ వేసి, ఆరు తిట్లు తినడమే ఆయన పని అని అనుకుంటారట కొందరు అభిమానులు.. మొత్తానికి కత్తి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే  ఆర్జీవీ తర్వాత సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేయడం.. ప్రతి విమర్శలు చేయించు కోవడంలో కత్తికి వెన్నతోపెట్టిన విద్య అని అప్పట్లో నెటిజన్లు విమర్శిస్తుండే వారు. ఇక ఆ మధ్య జరిగిన కొన్ని వివాదాల్లో వేలుపెట్టి కంపు కంపు లేపిన కత్తి ఈ మధ్యకాలంలో అంటే కరోనా వచ్చినప్పటి నుండి అకస్మాత్తుగా మాయమైయ్యాడు అని అనుకుంటున్నారట నెటిజన్స్.. సంగతి ఏంటో గానీ గత కొన్ని నెలలుగా కత్తి సోషల్ మీడియాలో కనిపించట్లేదు.. అంతేకాదు జనాలకూ ఆయన మాటలు వినిపించట్లేదు..

 

 

ఇలాంటి పరిస్దితుల్లో నెటిజన్లు ఒకరిద్దరు కత్తి ప్రస్తావన తీసుకురాగా.. ఇంకొందరు మాత్రం తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఎక్కడా కూడా కత్తి కంపించడం లేదు.. ఆయన మాట వినిపించడం లేదు.. మరోవైపు తమ వంతుగా ప్రతి వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీకి విరాళాలు ప్రకటిస్తున్నారు.

 

 

అసలు ఇక్కడ కూడా కత్తి కనిపించలేదు. అంటే తన పాపులారిటి కోసం సుత్తి పెట్టే కత్తికి పాపులారిటీతో పాటుగా సంపాదించుకోవడం తెలుసు కానీ అభిమానుల్ని, సినీ కార్మికుల్ని ఆదుకుని, తోచినంత సహాయం చేయడం మాత్రం తెలియదని అనుకుంటున్నారట.. మరి కొందరు నెటిజన్స్ అయితే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసే వారిపై దుమ్మెత్తి పోస్తున్నారట.. మరి ఇప్పటికైనా కత్తి మాటలు చెప్పేవాడు కాదు చేతల్లో కూడా కత్తినే అని నిరూపించుకుంటాడో.. లేక వొట్టి సుత్తిగాడనిపించుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: