డార్లింగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ మరియు కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి జాన్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలె ఈ చిత్ర యూనిట్ జార్జియా వెళ్ళి కరోనా ఉన్నప్పటికీ ఎక్కడా షూటింగ్కి బ్రేక్ రాకుండా చాలా పెద్ద ఫైటింగ్ సీక్వెన్స్ని పూర్తి చేసుకుని వచ్చారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లే అని చెప్పవచ్చు. ఇక పై ఆయన ఈ చిత్రానికి సంబంధించి చేయబోయే మిగతా షూటింగ్ అంతా హైదరాబాద్లోనే సెట్ వేసి చేస్తారట. ఇక పై ఎక్కడికి వెళ్ళేది లేదంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన సమాచారం. కరోనా మహమ్మారి వేరే దేశాల్లో ఎక్కువగా ఉన్న సమయంలోనే ప్రభాస్ తన ప్రాణాలకు తెగించి మరీ ఈ చిత్ర షూటింగ్ని చాలా మొండిగా దాదాపు పెద్ద ఫైట్ సీక్వెన్స్ని పూర్తి చేయడం పై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంత మంది భయపడుతూ మెసేజ్ చేస్తే మరి కొందరు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఇదిలా ఉంటే... జార్జియా షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన ప్రభాస్ అప్పటి నుంచి కూడా ఆయన తన రూమ్లో సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళి పోయారు. అయితే కేవలం ప్రభాస్ మాత్రమే కాదు ఆ చిత్ర యూనిట్ పూజాహెగ్డే తో సహా కలిపి అందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇక ప్రభాస్ కి మొదట్లో క్వారంటైన్లో ఉన్నప్పుడు చాలా బోర్ అనిపించేదట. ఏ మి చెయ్యాలో తోచక చాలా బోర్గా ఫీలవుతూ ఉండేవారట. ఇక కొంత టైమ్ దొరకడంతో ఆయన బుక్స్ చదువుతూ ఉండేవారట. అంతేకాక కొన్ని సినిమాలు చూసుకుంటూ అలా టమ్ పాస్ చేసేవారట. అయితే వీటన్నిటికంటే కూడా ఎక్కువగా వారిద్దరితో ఎక్కువగా వీడియోకాల్స్ మాట్లాడుతూ టైమ్పాస్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరూ అనుకుంటున్నారా... ఇంకెవరండీ ఒకరు అనుష్క మరొకరు రానా ప్రభాస్ ఎక్కువగా వీరిద్దరితో కలిసి వీడియోకాల్స్ మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తున్నారట. మొదట్లో క్వారంటైన్ బోర్ అనిపించినా ఇప్పుడు ఈయన ఈ ఇద్దరి ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ మొత్తానికి టైమ్ పాస్ చేస్తున్నారనమాట.