‘సాహో’ ఘోర పరాజయం తరువాత ప్రభాస్ ఏమాత్రం అనుభవంలేని జిల్ రాథాకృష్ణ మూవీలో నటించడంతో ఆమూవీ ఫలితం పై ప్రభాస్ అభిమానులు భయపడిపోతున్నారు. ఈమూవీ ఇంకా విడుదలకాకుండానే ఇప్పటి వరకు టాప్ హీరోలను దర్శకత్వం వహించిన అనుభవంలేకపోయినా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ప్రభాస్ ఓకె చెప్పడం అతడి అభిమానులను మరింత భయపెడుతోంది.


250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందబోయే ఈమూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు చాలవేగంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ కథకు సంబంధించిన ఒక లీక్ ఇప్పుడు ఈ లాక్ డౌన్ సమయంలో లీక్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు మరింత భయపడిపోతున్నారు. 


తెలుస్తున్న సమాచారం మేరకు సైన్స్ ఫ్యాంటసీ మూవీగా నిర్మింపబడే ఈమూవీ కథ బాలీవుడ్ లో విడుదలై సూపర్ ఫ్లాప్ అయిన ఒక మూవీ కథకు ప్రేరణ అని తెలుస్తోంది. 2010లో విడుదలైన అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాయ్ లు కలిసి నటించిన ‘యాక్షన్ రీప్లే’ మూవీ కథను నాగ్ అశ్విన్ ప్రభాస్ ల మూవీకథ పోలి ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది. 


‘యాక్షన్ రీప్లే’ లో అక్షయ్ కుమార్ తల్లి తండ్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆసంఘటన ఇష్టంలేని అక్షయ్ కుమార్ తన ప్రేయసి ఐశ్వర్య రాయ్ తండ్రి టైమ్ మిషన్ పై పరిశోధన చేస్తున్న సైంటిస్ట్ కావడంతో అతడి సహాయం తీసుకుని అక్షయ్ కుమార్ అతడి తల్లి తండ్రులను ఈ టైమ్ మిషన్ ద్వారా వారిద్దరూ ప్రేమించుకున్న 1970 ప్రాంతానికి తీసుకు వెళ్లి తిరిగి వారి ప్రేమ గుర్తుకు వచ్చేలా చేస్తాడు. దీనితో వారిద్దరూ తమ విడాకుల ఆలోచనలు విరమించుకుంటారు. ఈ సున్నితమైన కథ బాలీవుడ్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చకపోవడంతో ఈమూవీ ఆరోజులలో భయంకరమైన ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ మూవీ కథలో కూడ ప్రభాస్ తన తల్లితండ్రులు విడిపోవడం ఇష్టంలేక వారిద్దరిని టైమ్ మిషన్ లోకి తీసుకువెళ్ళి వారి ప్రేమను గుర్తుకు చేసి తిరిగి వారిద్దరిని కలిపే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీకి కొంత దేశభక్తి కలర్ కూడ ఇచ్చి నాగ్ అశ్విన్ ఒక కొత్త కథను వ్రాస్తున్నాడు. దీనితో ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ దేశభక్తి ట్రెండ్ తో మిళితమైన కథలు మాస్ ప్రేక్షకుల వరకు చేరుతాయ అంటూ ప్రభాస్ అభిమానులు నాగ్ అశ్విన్ ప్రయోగాల పై భయపడిపోతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: