దర్శకునిగా మారిన రచయితలలో కొరటాల శివ ముందువరసలో ఉంటారు. బృందావనం, మున్నా మరియు బిందాస్ చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఒక్క విజయంతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు కొరటాల శివ.. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' మరియు 'భరత్ అనే నేను',  జూనియర్ ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమా రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే చోటా హీరోల దగ్గర నుంచి ఎన్టీఆర్, మహేష్, మెగాస్టార్ వరకు ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు.

 

'ఆచార్య' సినిమా తరువాత కొరటాల చేయబోయే సినిమా ఎవరితో అని ఫ్యాన్స్ లో ఇప్పటికే చర్చ మొదలైపోయింది. ఏ స్టార్ హీరోతో కొరటాల ప్లాన్ చేస్తున్నాడో తెలిసిపోయింది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ తో సినిమా త‌ర్వాత కొర‌టాల.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. 2021లో ఈ చిత్రం మొదలవనుందని ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తుండగా.. ఆ తర్వాత త్రివిక్రమ్ కాంబోలో తన కెరీర్లో 30వ చిత్రాన్ని చేయనున్నాడు. ఇదిలా ఉండగా కొరటాల మరో ఐదారు చిత్రాలు తరువాత దర్శకత్వం నుండి తప్పుకుంటాడని కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: