పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. 'అజ్ఞాతవాసి' ఘోర పరాజయం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది తన కెరీర్లో 28వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. 

 

ఇంతకముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన 'దబాంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందువల్ల ఇప్పుడు రాబోతున్న చిత్రంపై ఫ్యాన్స్ అంతకుమించిన ఆశలను పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హరీష్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. కాగా హరీష్ ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు.. లాక్ డౌన్ తరువాత పవన్ ను కలిసి స్క్రిప్ట్ చెప్పబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట. ఎప్పటి నుండో పవర్ స్టార్ ని ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ ఆకలి ఈ సినిమాతో తీరనున్నదని సమాచారం. 

 

ఇదిలా ఉండగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు, బోణీ కపూర్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని బడా నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య కాలంనాటి ముఖ్యమైన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: