కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ విధించగా సినీ సెలబ్రిటీలు సరికొత్త కార్యకలాపాలతో తమ ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రెటీలు వంటలు, ఇంట్లో పనులు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ అభిమానులకు చూపిస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తుంది.


మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించిన తాప్సీ పన్ను మాత్రం తన చిన్ననాటి ఫోటో లను, అలాగే తన ఫోటో షూట్ కి సంబంధించిన చిత్రాలను కూడా ఎడిట్ చేసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంది. ఈ చిత్రాలలో తాపసీ పన్ను క్యూట్ డ్రెస్స్ నుండి భారతీయ దుస్తులను ధరించి అందరిని కట్టి పడేస్తుంది. అలాగే తన చిన్నతనంలో దిగిన ఓ ఫోటోని తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలో తాప్సీ పన్ను ఎర్ర రిబ్బన్ వేసుకొని రెండు జడలతో చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ పుట్టినరోజు కాకపోయినా తనకు కేకులు తినడమంటే చచ్చేంత ఇష్టం అని తాప్సి చెప్పుకొచ్చింది.


మరొక ఫోటోలో తాను తన బాల్కనీ లో కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ కాఫీ ఆస్వాదిస్తూ పేపర్ చదువుతూ కనిపించింది. అలాగే తన స్కూలు రోజుల్లో తాను ప్రతిరోజు జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించేదాన్ని అని తెలిపి... ఒక పాత ఫోటో ని కూడా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటో గురించి కాస్త వివరిస్తూ... నా పాఠశాల రోజులలో నేను ఫస్టు రావాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఒక రోజు నేను అనుకున్నట్టు గానే నా క్లాసు లోనే కాకుండా స్కూల్ మొత్తంలో ఫస్ట్ ర్యాంకు సాధించాను. ఫలితంగా నాకు క్లాసులు మొదలుపెట్టే ముందు నిర్వహించే జాతీయగీత ప్రార్థన కార్యక్రమంలో ఆలపించే అవకాశం కల్పించారు. నేను ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. ఈ ఫోటో తీసినప్పుడు కూడా 'నేను గట్టిగా కోరుకుంటే నిజంగానే జరిగేందేటి' అంటూ ఆలోచిస్తున్నాను. అందుకే ముందుకి చూడకుండా తల దించుకొని ఈ ఫోటోలో కనిపించాను' అని ఆమె చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: