గత ఏడాది
డియర్ కామ్రేడ్ తో నిరాశపరిచిన
కన్నడ బ్యూటీ
రష్మిక మందన్న ఈ ఏడాది ప్రారంభం లో సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ
సినిమా తరువాత ఆమె తెలుగులో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన
రష్మిక ఆ సమయాన్ని వృధా చేయకుండా పుష్ప కోసం కేటాయిస్తుందట. పుష్ప లో రష్మిక చిత్తూరు
అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమాలో
అల్లు అర్జున్ తో పాటు
రష్మిక కూడా చిత్తూరు స్లాంగ్ లో డైలాగులు చెప్పనుంది. దాంతో వీరిద్దరూ చిత్తూరు యాస ను నేర్చుకొనే పనిలో వున్నారు.
ఇందుకోసం అల్లు అర్జున్ సెపరేట్ కోచింగ్ తీసుకుంటుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సాయంతో రష్మిక ఈ యాస ను నేర్చుకుంటుంది. సో పుష్ప లో రష్మిక గొంతునే విననున్నాం. ఇంతకుముందు డియర్ కామ్రేడ్ , సరిలేరు లో కూడా రష్మిక ఓన్ గా డబ్బింగ్ చెప్పింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న పుష్ప లో బన్ని లారీడ్రైవర్ గా నటించనుండగా సుకుమార్ ఈ సినిమా ను డైరెక్ట్ చేయనున్నాడు. మైత్రి
మూవీ మేకర్స్ ,ముత్యం శెట్టి
మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు తోపాటు
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషల్లో విడుదలకానుంది.
ఇక
రష్మిక ప్రస్తుతం
కన్నడ లో పొగరు,తమిళంలో
కార్తి సరసన
సుల్తాన్ లో నటిస్తుంది. కాగా
కోలీవుడ్ లో ఇదే ఆమెకు మొదటి సినిమా.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా ఈఏడాది
సెప్టెంబర్ లో విడుదలకానుంది. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.