యోగా ప్రక్రియ నేడు దాదాపు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సూత్రం అయిపోయింది. యోగాతో లాభాలు గురించి ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూసేలా చేసుకున్నాం. అంతటి గొప్ప యోగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మరింతగా ఉపయోగపడుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో వారికి మానసిక ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్న ప్రక్రియ యోగా. ఇది నిజమని నిరూపిస్తోంది మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసిన యోగా స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు స్వయంగా సుస్మితా వేసిన యోగా మరింత వైరల్ అవుతోంది.
ఈ భంగిమలో సుస్మితా సేన్ ఓ దేవతా విగ్రహంలా ఉంది. ఫుల్ బాడీ ఫిట్ నెస్ తో ఉన్న సుస్మితా సేన్ ఈ యోగాసనం వేసింది. కేవలం తన కాలి మునివేళ్ల పైన మాత్రమే తన శరీర బరువునంతా ఉంచి ఏమాత్రం తడబడకుండా వేసిన స్టిల్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా.. ఈ భంగిమను కేవలం తన ఎడమ కాలి మీద మాత్రమే వేసింది. కుడి కాలును ఎడమ కాలి పై భాగంలో పెట్టడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. కళ్లూ మూసుకుని తన్మయత్వంతో రెండు చేతులను కూడా యోగా ప్రక్రియకు అనుగుణంగా నమస్కారం పెడుతున్నట్టున్న స్టిల్ చూస్తే యోగాలో ఇంత ప్రావీణ్యం సుస్మితా సేన్ ఎలా సాధించిందా అనే ప్రశ్నలు రాక మానవు.
‘ఈ ప్రక్రియను చేయడానికి మొదట కష్టపడ్డాను. పడిపోయాను కూడా. కానీ తదేకంగా నాలో ఆత్మవిశ్వాసం పెంచకుని కేవలం నా ఒక కాలి మునివేళ్లపై ఈ యోగా భంగిమ వేయగలిగాను.’ అంటూ తన వాల్ లో రాసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యోగా ద్వారా మానసికంగా ధైర్యంగా ఉండాలని చెప్పకనే చెప్తోంది సుస్మితా.
View this post on InstagramThis one I challenged myself to do!!!👏😁😍 body balanced on tippi toes, had to find & align myself with the center of my being!!!❤️ of course kept falling off initially 😄 but boy what a feeling it is to find balance & stability after all the failed attempts!! Ah #life 😇🤗❤️💃🏻try it...it’s magical!! 👏😍 I love you guys!!!