టాలీవుడ్ లో ఇప్పుడు విజయశాంతి హాట్ టాపిక్ అయ్యారు. ఆమె రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమా ఒకటే అయినా ఆమె గురించి మాత్రం ఎప్పుదూఎదోక వార్త వస్తూనే ఉంది. సోషల్ మీడియా తో పాటుగా ప్రధాన మీడియాలో కూడా ఆమె గురించి పదే పదే ఏదోక కథనం వస్తూనే ఉంది. ఆమెకు ఆఫర్లు వచ్చాయని ఆ సినిమాసినిమా అంటూ ఏదోక ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలో నటించడం లేదు. అయినా సరే పలానా హీరో సినిమా అంటూ ఆమె గురించి కథనాలను ప్రసారం చేస్తూనే ఉన్నారు. 

 

ఇది ఇలా ఉంటే ఆమెకు ఒక ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే లూసిఫర్ సినిమాలో ఆమెకు ఒక కీలక పాత్ర దక్కినట్టు సమాచారం. ఆ సినిమాలో విలన్ పాత్రకు గాను ఆమెనుఖరారు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది స్పష్టత లేదు గాని ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున కథనాలు దీని ఆధారంగా వస్తున్నాయి. రాములమ్మ కోసం నేరుగా చిరంజీవి అడిగారని ఆమె అందుకు ఓకే అన్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా ముందు మొదలుపెట్టే యోచనలో చిరంజీవి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: