నిజంగా ఇది షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇద్దరూ సూపర్ స్టార్లు. ఇద్దరూ ఎవరికి వారే శిఖరాలు. ఇద్దరూ ఇంచుమించుగా ఒకే టైంలో ఇండస్ట్రీకి రావడమే కాదు, తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. ఇద్దరూ టాలీవుడ్ లో  ప్రస్తుత తరానికి టాప్ సీనియర్ స్టార్లు.

 

మరి ఈ ఇద్దరినీ కలిపి సినిమా తీస్తే అది నిజంగా ఎలా ఉంటుంది అనేదానికంటే ఎలా ఉన్న చూసేస్తాం అనే ఫ్యాన్స్ ముందు రెడీగా ఉంటారు. ఆ ఇద్దరి స్టార్ల క్రేజ్ అలాంటిది. ఇదిలా ఉండగా ఈ ఆలోచన గతంలో అంటే పదేళ్ళ క్రితమే కొందరు చేసినా వర్కౌట్ కాలేదు.

 

మరి అటువంటిది ఒక యంగ్ డైరెక్టర్ మాత్రం వారిద్దరినీ కలిపేస్తాను, ఆకాశామంతా హిట్ కొడతాను అంటున్నాడు. ఆయన ఎవరో కాదు మొదట నటుడిగా పరిచయం అయి ఆ తరువాత డైరెక్ట్ గా మారిన రాహుల్ రవీంద్రన్. ఆయన మొదట అక్కినేని మేనల్లుడి సుశాంత్ తో చి సౌ ల అనే లో బడ్జెట్ మూవీని తీశాడు.

 

మూవీ హిట్ అయింది. రెండవ ప్రయత్నంగా ఏకంగా అక్కినేని నాగార్జునతో  మన్మధుడు 2 మూవీ చేశాడు. అది మాత్రం ఫట్ అయింది. ఇపుడేవో కొత్త ప్రాజెక్టులు చేసుకుంటున్న ఈ డైరెక్టర్ గారు తన డ్రీం ప్రాజెక్ట్ ఇదీ అంటూ ఒక షాకింగ్ న్యూస్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

అది చూసిన వారు మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యారు. అటు మహేష్, ఇటు పవన్ ఫ్యాన్స్ అయితే ఆనందంతో ఊగిపోయారు. మరి ఆ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలెక్కితే మాత్రం సెన్సేషనల్ హిట్ అవడం ఖాయమని అంటున్నారు.  మరి అలా జరగాలని అంతా కోరుకుంటున్నారు.

 

ఓ విధంగా ఇద్దరూ హీరోలూ ఇప్పటికేవేరే హీరోలతో  మల్టీ స్టారర్ మూవీస్ చేసి ఉన్నారు. దాంతో వారికి కలసి చేయడానికి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ మంచి కధ మాత్రం దొరకాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: